telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కరోనా వైరస్ ఎఫెక్ట్.. ఇటలీలో చిక్కుకున్న భారత విద్యార్థులు

karona effect

కరోనా వైరస్ (కోవిడ్-19) కారణంగా ఇటలీలో ఇప్పటి వరకు 17 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం విమాన సర్వీసులను రద్దు చేసింది. దీంతో స్వదేశానికి వచ్చేందుకు టికెట్లు బుక్ చేసుకున్నప్పటికీ విమాన సర్వీసులు రద్దు కావడంతో పావియా పట్టణంలో చిక్కుకున్న 85 మంది భారత విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

చిక్కుకున్న భారత విద్యార్థుల్లో 25 మంది తెలంగాణ విద్యార్థులు కాగా, 20 మంది కర్ణాటక, 15 మంది తమిళనాడు, నలుగురు కేరళ, ఇద్దరు ఢిల్లీ విద్యార్థులు ఉండగా, రాజస్థాన్, గురుగ్రామ్, డెహ్రాడూన్ నుంచి ఒక్కో విద్యార్థి చొప్పున ఉన్నారు. మరోవైపు వారు చదువుకుంటున్న పావియా యూనివర్సిటీలోని ఇంజినీరింగ్ విభాగంలో ఓ విద్యార్థిలో కరోనా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో విద్యార్థులు భయంతో గడుపుతున్నారు. పరిస్థితులు మరింత విషమించకముందే భారత ప్రభుత్వం తమకు సాయం అందించి స్వదేశం రప్పించే ఏర్పాట్లు చేయాలని బాధిత విద్యార్థులు కోరుతున్నారు.

Related posts