ప్రముఖ తెలుగు సినీ నిర్మాత దిల్ రాజు ఇంటితో పాటు హైదరాబాద్ లోని ఆయన కార్యాలయంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం బృందాలుగా విడిపోయిన అధికారులు ఇంటితో పాటు ఆఫీసులను రికార్డులను తనిఖీ చేస్తున్నారు. మహేశ్ బాబు హీరోగా నటించిన మహర్షికి సినిమాకు దిల్ రాజు సహ నిర్మాతగా వ్యవహరించారు.
దీంతో ఈ సినిమా బడ్జెట్, బిజినెస్, కలెక్షన్లపై అధికారులు ఆరా తీస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన ఎఫ్2 సినిమా కూడా గొప్ప విజయాన్ని సాధించింది. దీంతో గతంలో చెల్లించిన పన్ను, కలెక్షన్లను కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. మహేశ్ బాబు, పూజాహెగ్డే జంటగా నటించిన మహర్షి సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు దాడులు చేయడం గమనార్హం.
ఆకట్టుకుంటున్న “కలర్ ఫోటో” టీజర్… ఈ సుహాస్ని తొక్కేయాలి బ్రహ్మాజీ కౌంటర్