telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు

టీవీ 9 వివాదఛాయలు : .. రామేశ్వరరావు ఇంటిపై ఐటీ దాడులు.. 100మంది..

iT rides on tv9 quarrel introduced rameswararao

ఇటీవల జరిగిన టీవీ9 చానల్ యాజమాన్య వివాద ఛాయలలో వచ్చిన మై హోం గ్రూప్ అధినేత రామేశ్వరరావు నివాసాలు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 100 మంది వరకు అధికారులు పాలుపంచుకున్నట్టు సమాచారం. నందగిరి హిల్స్ లోని రామేశ్వరరావు నివాసంపైనే కాకుండా, నగరంలోని పలుచోట్ల ఉన్న మై హోం కార్యాలయాల్లో కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

పలు పత్రాలను పరిశీలించి, ఆస్తుల విలువను మదింపు చేస్తున్నట్టు సమాచారం. గతకొంతకాలంగా పారిశ్రామికవేత్తలుగా మారిన రాజకీయనేతలపైనా, రాజకీయనేతలతో సన్నిహిత సంబంధాలున్న పారిశ్రామికవేత్తలపైనా ఐటీ విభాగం దాడులు జరుగుతుండటం విశేషం.

Related posts