సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ మంత్రి నారాయణ ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించడం కలకలం రేపింది. నెల్లూరు నగరంలోని నారాయణ మెడికల్ కాలేజీ కార్యాలయంతో పాటు ఆయన నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించారు. దాదాపు నాలుగు బృందాలు తనిఖీల్లో పాల్గొన్నాయి. ఎన్నికల ప్రచార సమయంలో ఈ దాడులు జరగడంతో టిడిపిలో కలవరం మొదలైంది.విజయనగరం జిల్లా చీపురుపల్లి సభలో చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ నేతల ఇళ్లపై ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేసిన కొద్దిసేపటికే ఈ దాడులు జరగడం కొసమెరుపు.
previous post