telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

కలర్స్‌ హెల్త్‌ కేర్‌ సంస్థల్లో ఐటీ దాడులు..కీలక పత్రాలు స్వాధీనం

colours health care hyd

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సంస్థ కలర్స్‌ హెల్త్‌ కేర్‌ బ్రాంచ్‌లపై బుధవారం ఐటీ అధికారులు దాడి చేశారు. ఆదాయపు పన్ను సరిగా చెల్లించడం లేదని గుర్తించిన అధికారులు యాజమాన్యానికి నోటీసులు జారీచేసింది. అయినప్పటికీ స్పందించకుండా నిర్లక్ష్యం చేసింది. దీంతో కలర్స్‌ హెల్త్‌ కేర్‌ సంస్థకు దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 49 బ్రాంచ్‌ల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు.

తిరుపతిలోని రెండు బ్రాంచ్‌ల్లో కూడా ఐటీ అధికారులు దాడి చేశారు. తిరుపతి కేటీరోడ్డు, ఎంఆర్‌పల్లి సర్కిల్‌ బ్రాంచ్‌లలో హైదరాబాద్, చెన్నై నుంచి వచ్చిన రెండు బృందాలు సోదాలు చేపట్టి పలు కీలక పత్రాలు, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. దాడులకు సంబంధించి ఐటీ అధికారులు కానీ, కలర్స్‌ సంస్థ ప్రతినిధులు కానీ వివరాలు వెల్లడించలేదు.

Related posts