గతంలో బెంగళూరు, మహారాష్ట్రలకు ధీటుగా హైదరాబాద్ ఐటీ హబ్ పెరిగిందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మెదక్కలెక్టరేట్లో జాతీయపతాకాన్ని తలసాని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 74 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి ఆరేళ్ల కాలంలో జరిగిందన్నారు. దేశం మొత్తం తెలంగాణ రాష్ర్టాన్ని ఆదర్శంగా తీసుకుంటుందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఒకవైపు అభివృద్ధి, మరో వైపు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అన్నారు. అమర వీరుల త్యాగాల వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఆరేళ్లలో ఎంతో అభివృద్ధి సాధించిన తెలంగాణ వైపు యావత్ దేశం ఆదర్శంగా చూస్తోందన్నారు. రైతులకు 24గంటల కరెంట్ ఇవ్వడంతో పాటు ఎన్నో అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఘనత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.
టీడీపీ నేతలు ఆ నిధులను కూడా మింగేశారు: విజయసాయిరెడ్డి