telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఐటీ గ్రిడ్ కేసు : నేడు అశోక్ గైర్హాజరైతే.. చట్టపరమైన చర్యలు.. !

IT Grids Scam Arrest warent Ashok

నేడు తెలంగాణ సిట్ ఎదుట డేటా చౌర్యం కేసులో ప్రధాన నిందితుదిగ పేర్కొన్న అశోక్ నేడు విచారణకు హాజరు కావాల్సి ఉండగా, ఆయన వస్తాడా? లేదా? అన్నది రహస్యంగానే మారింది. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైన ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత అశోక్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఈ కేసు దర్యాప్తు కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ మాదాపూర్‌లోని ఐటీ గ్రిడ్స్ యజమాని అశోక్‌ను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించిన అధికారులు తమ ఎదుట హాజరు కావాల్సిందిగా ఈ నెల 2, 3 తేదీల్లో నోటీసులు జారీ చేశారు.

అప్పటికే అజ్ఞాతంలో ఉన్న అశోక్ వాటికి స్పందించలేదు. దీనితో రెండు సార్లు నోటీసులు జారీ చేసిన అధికారులు కేపీహెచ్‌బీలోని ఆయన ఇంటికి వాటిని అతికించారు. నేడు గోషామహల్‌లోని సిట్ కార్యాలయంలో హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. ఐటీ గ్రిడ్, బ్లూఫ్రాగ్ సంస్థల్లో ఇప్పటికే సోదాలు నిర్వహించిన పోలీసులు పలు ఉపకరణాలు స్వాధీనం చేసుకున్నారు. నేడు అశోక్ కనుక విచారణకు హాజరు కాకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు యోచిస్తున్నారు.

అయితే అశోక్ రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ చదరంగంలో పావు అయ్యాడా.. అసలు ఉన్నాడా .. బయటకు వస్తే సాక్ష్యం అవుతాడేమో అని.. అజ్ఞాతం పేరుతో… పరలోకాలకు పంపించారా..? ఈ అనుమానాలన్నీ నేడు ఆయన హాజరుకాని పక్షంలో అందరిలో వెల్లువలా వచ్చిపడేవని విశ్లేషకులు భావిస్తున్నారు.

Related posts