తమిళనాడులో రెండవరోజు ఎన్నికల సంఘం సోదాలు చేస్తుంది. నేడు కూడా 15 కోట్లు ఈసీ పట్టుకుంది. వెతికేకొద్దీ నగదు పట్టుబడుతుండటం ఆందోళనను కలిగిస్తుంది. నిన్న దొరికిన నగదు లెక్కింపులు ఇంకా జరుగుతుండగానే నేడు కూడా భారీగా నగదు పట్టుబడింది.
తమిళనాడు మంత్రి వేలుమణి సన్నిహిత కాంట్రాక్టర్ సబిశాన్ ఇంట్లో ఈసీ అధికారులు తనిఖీలు జరిపారు. ఈ సందర్భంగా 15 కోట్లు లభించినట్టు ఐటీ అధికారులు తెలిపారు. స్టాలిన్ ఫిర్యాదుతో ఈ మేరకు తనిఖీలు జరిగినట్టు తెలుస్తుంది. ఇంకా తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి.