telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ సినిమా వార్తలు

ప్రముఖ తమిళ నటులకు .. ఐటీ కేసులు.. త్వరలో అరెస్ట్ ..

IT case filed on sarat and chinmayi

మీ టూ ఉద్యమం తమిళ ఇండస్ట్రీలో ప్రకంపనలు కొనసాకొనసాగిస్తుంది. ఇటీవల ప్రముఖ సింగర్ చిన్మయి తమిళ గేయ రచయిత వైర ముత్తు పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వారిద్దరి మద్య గొడవ కొనసాగుతూనే ఉంది. ఆ మద్య సినియర్ నటుడు రాధరవిపై నయన తార ఆరోపణలు చేసింది. తనపై అవమానకరమైన మాటలు మాట్లాడరని అతనిపై చర్యలు తీసుకోవాలని కోరింది. సీనియర్ నటుడు రాధారవి, హీరో శరత్‌కుమార్‌లను అరెస్ట్ చేయాల్సిందిగా మద్రాస్ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. 2017లో శరత్ కుమార్ నడిగర్ సంఘంకు అధ్యక్షుడిగా, రాధారవి కార్యదర్శిగా పనిచేశారు.

ఓ స్థల వివాదంలో వీరిపై కేసు నమోదు అయ్యింది. నడిగర్ సంఘానికి చెందిన ఓ స్థలాన్ని వీరు ఆక్రమంగా అమ్మేసినట్లు 2017లో కేసు నమోదయ్యింది. కాంచీపురంలో వెంకటామంగళంలోని ఓ స్థలాన్ని అమ్మేసినట్లు ఓ వ్యక్తి 2017లో కేసు వేశాడు. అప్పటి నుండి కోర్టు విచారణలో ఉన్న కేసుకు సంబంధించి శనివారం తీర్పు వచ్చింది. ఈ నేపథ్యంలో వీరిద్దరిని వెంటనే అరెస్ట్ చేసి కేసు పూర్తి చేయాలని మద్రాస్ హైకోర్ట్ పోలీసులను ఆదేశించింది.

Related posts