ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ ప్రభుత్వం తొలి జీవోను జారీ చేసింది. నిన్న ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం వృద్దాప్య పెన్షన్ ను పెంచుతున్నట్టు జగన్ ప్రకటించారు. ఈ మేరకు తన తొలి సంతకాన్ని ఆ ఫైల్ పై పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతమున్న పింఛన్లను రూ. 2 వేల నుంచి రూ. 2,250కి పెంచుతున్నట్టు జగన్ ప్రకటించారు. దీనికి ‘వైఎస్ఆర్ పెన్షన్ కానుక’ అని పేరు పెట్టారు.
కొత్త పెన్షన్ కు సంబంధించి చీఫ్ సెక్రెటరీ జీవోను విడుదల చేశారు. వికలాంగులకు రూ. 3 వేలు, కిడ్నీ బాధితులకు రూ. 10 వేలతో పాటు వయోవృద్ధుల పెన్షన్ వయసును 65 నుంచి 60కి కుదిస్తున్నట్టు జీవోలో పొందు పరిచారు. జూలై 1 నుంచి కొత్త పెన్షన్ పథకం అమలవుతుందని ఇందులో పేర్కొన్నారు.
టీడీపీని అప్రతిష్టపాలు చేయడమే వైసీపీ లక్ష్యం: యనమల