telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ఇస్రో కు ప్రధాని మోదీ అభినందనలు

ISRO Successfully Launches PSLV C44

మరో చారిత్రక ప్రయోగాన్ని విజ‌య‌వంతంగా ప్రయోగించినందుకు ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఈరోజు ఉద‌యం ఆయ‌న త‌న ట్విటర్ ద్వారా విషెస్ చెప్పారు. పీఎస్‌ఎల్‌వీ-సీ44 రాకెట్‌ను ఇస్రో నింగిలోకి ప్రవేశపెట్టింది. గురువారం రాత్రి 11 గంటల 37 నిమిషాలకు రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. రెండు ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ-సీ44 కక్ష్యలోకి తీసుకెళ్లింది.

తమిళనాడుకు చెందిన విద్యార్థులు రూపొందించిన కలాంశాట్‌తో పాటు మైక్రోశాట్‌ ఉపగ్రహాలను కూడా నిగింలోకి పంపారు. మైక్రోశాట్‌ ఉపగ్రహాలు దేశ రక్షణ రంగానికి సమాచారాన్ని అందించనుంది. మైక్రోగ్రావిటీ పరీక్షల కోసం ఇస్రో చేస్తున్న కృషి అభినంద‌నీయం అని మోదీ అన్నారు.

Related posts