తమిళనాడు ప్రభుత్వం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో కృషి చేసినవారికి అందజేసే డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం పురస్కారం ఈ ఏడాది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఛైర్మన్ కె శివన్కు లభించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం నాడు ఈ పురస్కారాన్ని ముఖ్యమంత్రి కె పళినిస్వామి నుంచి ఆయన అందుకోవాల్సి వుండగా..హాజరుకాకపోవడంతో త్వరలో అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
చెన్నైలోని సెయింట్ జార్జ్ ఫోర్ట్ వద్ద జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి వివిధ రంగాల్లో కృషి చేసినవారికి పురస్కారాలు అందజేశారు. కడలూరు మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పి రమ్యలక్ష్మికి కల్పనా చావ్లా పురస్కారం లభించింది. పి. షణ్ముగవేలు, అతని భార్య సెంథమరరు సాహస పురస్కారాలు అందజేశారు. ‘ధర్డ్ ఐ’ పేరుతో సిసిటివి కెమెరాల ఏర్పాటుకు కృషి చేసిన గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనరేట్కు కూడా పురస్కారం లభించింది.
అమరావతి నేల నిర్మాణాలకు అనుకూలం కాదు: విజయసాయిరెడ్డి