పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్పై పూరి జగన్నాధ్, ఛార్మి సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “ఇస్మార్ట్ శంకర్”. రామ్ పోతినేని హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్స్ గా కనపడనున్నారు. ఈ చిత్రంలో స్టైలిష్ లుక్లో రామ్ కనిపించనున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఓ హాలీవుడ్ చిత్రం ప్రేరణగా రూపొందుతోందని సమాచారం. ప్రస్తుతం టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. సాంగ్స్ చిత్రీకరణకు రెడీ అవుతోంది. ఇక చిత్ర టీజర్ను మే 15న విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ అఫీషియల్గా ప్రకటించింది. సతీష్ మాస్టర్ కొరియోగ్రఫీలో పూరి జగన్నాధ్ స్టైల్ ఆఫ్ టేకింగ్లో భారీ హంగులతో ఈ ఫైట్ సీన్స్ తెరకెక్కనున్నాయి.
దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం బిజినెస్ ఆశించిన స్థాయిలో జరగడం లేదట. డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరో రామ్కు ఇటీవలి కాలంలో హిట్లు లేకపోవడంతో ఆ సినిమాకు పెద్దగా డిమాండ్ లేదట. ఆ సినిమా థియేట్రికల్ హక్కులను కేవలం 20 కోట్లకు ఓ సంస్థ అడిగినట్టు తెలుస్తోంది. అయితే నిర్మాతలు పూరీ, చార్మీ మాత్రం ఇంకా ఎక్కువ ఆశిస్తున్నారట. ఈ సినిమా టీజర్, ట్రైలర్ రిలీజ్ అయితే మంచి హైప్ వస్తుందని భావిస్తున్నారట. అప్పటివరకు హక్కులను ఎవరికీ విక్రయించకూడదని భావిస్తున్నారట.
నిర్భయ నిందితులతో పాటే ఆమెను కూడా జైల్లో… కంగనా సంచలన వ్యాఖ్యలు