నటిగా కెరీర్ ఎండ్ అయిపోయిన తరువాత నిర్మాతగా మారింది ఛార్మి. పూరి సినిమాలకు కాస్టింగ్, నిర్మాణ ఖర్చులు అన్నీ ఛార్మినే చూసుకుంటోంది. ఇప్పుడు చార్మి పూరికి ప్రధాన సలహాదారుగా మారిందట. పూరి తాజా సినిమా “ఇస్మార్ట్ శంకర్” మేలో విడుదల చేస్తానని పూరి సినిమా ప్రారంభించిన రోజే ప్రకటించారు. కానీ ఆ సినిమా ఇప్పుడు విడుదల కావడం లేదు. దానికి ఇంకా కొంత సమయం పట్టేటట్టుగా ఉందట. సినిమా బాగా రావాలని అప్పుడే విడుదల చేద్దామనీ, అవసరమైతే కొన్ని సీన్లు రీషూట్ చేద్దామని ఛార్మి పూరికి సలహా ఇచ్చిందట. ఆ సలహా మేరకే సినిమా విడుదలను ఆపేశారంటున్నారు ఫిల్మ్ నగర్ వర్గాలు
భయపడి బయటకు రాలేదు… ఇప్పుడా బాధ లేదు : సమీరా రెడ్డి