టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా రూపొందుతున్న చిత్రం “ఇస్మార్ట్ శంకర్”. తాజాగా ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది చిత్రబృందం. ఈ చిత్రంలో రామ్ సరసన నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఐసీసీ వరల్డ్ కప్ క్రికెట్ కారణంగా ఈ చిత్రం విడుదలను వాయిదా వేస్తున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని జూలై 12న విడుదల చేయనున్నట్టు ముందుగా ప్రకటించారు. కానీ వరల్డ్ కఫ్ ఫైనల్ జూలై 14న జరగనుంది. వరల్డ్ కప్ క్రికెట్ ఫీవర్ బీభత్సంగా ఉండటంతో జనాలు సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపరు. ప్రేక్షకులెవరూ పెద్దగా థియేటర్స్కి రారు. కాబట్టి వరల్డ్ కప్ ఫైనల్స్ ప్రభావం చిత్రంపై పడే అవకాశం ఉంది. కాబట్టి చిత్రబృందం ఆ తేదీలో సినిమాను విడుదల చేయడానికి వెనకడుగు వేస్తోంది. దీంతో “ఇస్మార్ట్ శంకర్” ను జూలై 12 నుంచి 18 వాయిదా వేసింది చిత్రబృందం. ప్రస్తుతం అంతటా వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తుంది. చిన్న పిల్లల నుంచి ముదుసలి వరకు మధ్యాహ్నం 3 అయిందంటే టీవీలకి అతుక్కుపోతున్నారు. క్రికెట్ ప్రభావంతో ఎప్పుడు కళకళలాడే సినిమా థియేటర్స్ వెలవెలపోతున్నాయి. వరుస సినిమాలు థియేటర్స్లోకి వస్తున్నప్పటికి ప్రేక్షకుల సంఖ్య మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ క్రమంలో కలెక్షన్స్ కూడా భారీగా డ్రాప్ అవుతున్నాయి.
previous post