పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన “ఇస్మార్ట్ శంకర్”గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో రామ్ హీరోగా, నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటించారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మించారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీత సారథ్యం వహించారు. ఈ సినిమాకు మొదటి షో నుండే పాజిటివ్ టాక్ రావడంతో తొలి రోజు అన్ని థియేటర్లు హౌస్ఫుల్ అయ్యాయి. ముఖ్యంగా బీ, సీ సెంటర్లలో తొలి రోజు వసూళ్లను ఎవరూ ఊహించలేదు. హీరో రామ్ కి, దర్శకుడు పూరీకి చాలాకాలం తరువాత మంచి హిట్ దక్కింది. ఇస్మార్ట్ శంకర్ ఏకంగా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 7.83 కోట్ల షేర్ సాధించి ట్రేడ్ వర్గాలను ఆర్చర్యపరిచాడు. వరుస ప్లాపులతో ఉండి మార్కెట్ పూర్తిగా పడిపోయిన పూరి, రామ్ కాంబోలో వచ్చిన సినిమాకు ఈ రేంజ్ వసూళ్లు రావడం గొప్పే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
“ఇస్మార్ట్ శంకర్” ఫస్ట్ డే వసూళ్లు (కోట్లలో)
నైజాం – రూ. 3.43
సీడెడ్ – రూ. 1.20
వైజాగ్ – రూ. 0.86
ఈస్ట్ – రూ. 0.50
వెస్ట్ – రూ. 0.40
కృష్ణ – రూ. 0.53
గుంటూరు – రూ.0.57
నెల్లూరు – రూ. 0.30
ఏపీ + తెలంగాణ మొత్తం = రూ. 7.83 కోట్లు
రాంగోపాల్ వర్మ మనుషులు పోలీస్ స్టేషన్లో క్షమాపణ చెప్పారు… అందుకే కేసు వెనక్కు…!!