telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అక్కడే సెటిలైన రాశి ఖన్నా..

రాశి ఖన్నా ఈ పేరు తెలియని వారుండరు అనడంలో సందేహం లేదు. దాదాపు ఆరేళ్లుగా తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్‌గా కొనసాగుతోంది. అగ్ర హీరోల సరసన నటించే అవకాశం రాకపోయిన తన స్థాయిలో తనదైన పాత్రలతో అందరిని ఆకట్టుకుంటోంది. ఊహలు గుసగుసలాడే అంటూ కుర్రకారుని ఊహల్లో తేల్చేసింది ఈ ఢిల్లీ బ్యూటీ. అయితే కొన్నేళ్లుగా టాలీవుడ్ నాట ఈ అమ్మడుకి అనుకున్న స్థాయిలో అవకాశాలు లేవు. వరల్డ్ ఫేమస్ లవర్ తరువాత మరో సినిమాకు రాశీ సంతంకం చేయలేదు. కానీ టాలీవుడ్‌లో అవకాశాలు ఎంత తక్కువ ఉన్నా, తమిళంలో మాత్రం మంచి జోష్‌ను కొనసాగిస్తోంది. వరుస సినిమాలతో తమిళంలో చక్రం తిప్పుతోంది. ఇప్పటికిప్పుడు దాదాపు నాలుగైదు సినిమాలను చేస్తూ బీజీ అయిందంటేనే తెలుస్తోంది. అక్కడ ఈ అమ్మడుకి ఎంత క్రేజ్ వచ్చిందో. అయితే రాశీ తన పుట్టిన రోజు సందర్భంగా తన కొత్త సినిమా వివరాలను వెల్లడించింది. తను కొత్తగా ఓ భారీ బడ్జెట్ సినిమాలో నటించనుందని, అందులో చియాన్ విక్రమ్ ప్రధాన పాత్ర చేస్తున్నాడని తెలిపింది. అయితే ఈ సినిమాకు ఇప్పటికీ ఇంకా నామకరణం కాలేదు. ఈ సినిమాకి స్టార్ డైరెక్టర్ హరి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం రాశీ ఆరణ్మనౌ 3-తుగ్లక్ దర్బార్-మేధావి అంటూ రెండు సినిమాలు చిత్రీకరణలో ఉన్నాయి. మరో సినిమా సైతాన్ కా బచ్చా విడుదల కావాల్సి ఉంది. అందుకని తమిళంలో వరుస ఆఫర్లు ఉండే సరికి రాశీ తెలుగు పరిశ్రమను పక్కన పెట్టిందా అని అభిమానుల్లో అనుమానాలు చెలరేగాయి. మరి దానికి రాశీనే సమాధానం చెప్పాల్సి ఉంది.

Related posts