telugu navyamedia
సినిమా వార్తలు

రామ్ చరణ్ కు అవార్డు రాకపోవడంపై నెటిజన్లు ఫైర్

Rangasthalam

ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటులుగా ఆయుష్మాన్ ఖురానా (అంధాధున్), విక్కీ కౌశల్ (ఉరి: ది సర్జికల్ స్ట్రైక్) పేర్లను కమిటీ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎంపికపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా విక్కీ కౌశల్‌కు ఉత్తమ నటుడి అవార్డు ప్రకటించడాన్ని సినీ ప్రముఖులు కూడా తప్పు పడుతున్నారు. ఈ ఏడాది ప్రకటించిన జాతీయ అవార్డుల్లో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌కు తీరని అన్యాయం జరిగిందని సినీ ప్రముఖులతోపాటు నెటిజన్లు కూడా అభిప్రాయపడుతున్నారు. రామ్‌చరణ్‌కు అవార్డు రాకపోవడంపై తెలుగు సినీ ప్రముఖులు మంచు విష్ణు, దర్శకుడు బీవీఎస్ రవి నిరాశ వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నెటిజన్లు కూడా తమ నిరాశను ట్వీట్ల ద్వారా వ్యక్తం చేస్తున్నారు. `ఈ ఏడాది `జాతీయ ఉత్తమ నటుడు` అవార్డుకు ఎంపికైన ఇద్దరూ అనర్హులే. నా ఉద్దేశం ప్రకారం ఆ అవార్డుకు రామ్‌చరణ్ (రంగస్థలం), రణ్‌బీర్ కపూర్ (సంజూ) అర్హులు` అని ఒకరు ట్వీట్ చేశారు. `రంగస్థలం`లో రామ్‌చరణ్‌ నటన చూసి అప్పుడు షాకయ్యా.. అంత గొప్పగా నటించినా అవార్డు రాకపోవడంతో ఇప్పుడు మరోసారి షాకయ్యాన`ని ఇంకొకరు ట్వీట్ చేశారు. మరి ఈ విమర్శలపై జాతీయ అవార్డుల కమిటీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related posts