telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

బాలీవుడ్ లో సెటిల్ అయ్యే ప్రణాళికలో.. రకుల్ ప్రీత్ సింగ్ …

Rakul-PReeth-Singh

ఈ ఏడాది ఆరంభం నుండే నటి రకుల్ ప్రీత్ సింగ్ పలు చిత్రాలతో బిజీ బిజీగా ఉందట. బాలీవుడ్‌ ‘ఎటాక్‌’ చిత్ర షూటింగ్ లో జాయిన్‌ అయింది. నటుడు జాన్‌ అబ్రహాం హీరోగా లక్ష్యరాజ్‌ దర్శకత్వంలో హిందీలో ‘ఎటాక్‌’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 2008లో ఢిల్లీలో జరిగిన ఓ ఉగ్రవాద దాడి ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు జాన్‌ అబ్రహాం.

గత ఏడాది డిసెంబరులో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ప్రస్తుతం జాన్‌ , రకుల్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ‘ఎటాక్‌’ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. మరోవైపు అజయ్‌ దేవగన్‌-సిద్దార్థ్‌ మల్హోత్రా, అర్జున్‌ కపూర్‌ హీరోలుగా నటిస్తున్న చిత్రాల్లో రకుల్‌ హీరోయిన్ గా చాన్స్‌ కొట్టేసింది.

Related posts