హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం “వాల్మీకి”. ఈ చిత్రంలో పూజా హెగ్డే, మృణాలిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. 14 రీల్స్ సంస్థపై రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరో వరుణ్ తేజ్ సరికొత్త మాస్ లుక్ లో దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ తోనే మాస్ ఆడియెన్స్ లో అంచనాలు రేపాడు. తమిళ్ సినిమా “జిగర్తాండ”కు ఈ సినిమా రీమేక్. ఇప్పటివరకు డిఫరెంట్ జోనర్స్లో, విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న వరుణ్తేజ్ ఈ సినిమాలో గ్యాంగ్స్టర్గా మరో డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 20న విడుదల చేయనున్నారు. ప్రముఖ తమిళ్ హీరో మురళి తనయుడు యువ హీరో అధర్వ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక యంగ్ హీరో నితిన్ కూడా ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో కన్పించనున్నారట. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా తర్వాత పవర్స్టార్ పవన్ కల్యాణ్ కోసం హరీష్ శంకర్ కథ సిద్ధం చేయబోతున్నాడట. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోందట. ఇప్పటికే పవన్, హరీష్ మధ్య చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. రాబోయే రెండేళ్లు సినిమాలు చేయాలని పవన్ అనుకుంటున్నారట. ప్రస్తుతం ఆ దిశగానే ఆలోచిస్తున్నట్టు సమాచారం. హరీష్ మంచి కథ తీసుకుని వెళ్తే పవన్ సినిమా చేయడానికి సిద్ధంగానే ఉన్నట్టు తెలుస్తోంది. వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న సమయంలో హరీష్ రూపొందించిన “గబ్బర్సింగ్” ద్వారానే పవన్ తిరిగి ఫామ్లోకి వచ్చాడు. మరోసారి వీరి కాంబినేషన్ వర్కవుట్ అవుతుందని మెగా అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.
previous post