వెంకీ అట్లూరీ దర్శకత్వంలో నితిన్ నటించిన చిత్రం రంగ్దే. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించింది. రొమాంటిక్ ప్రేమ కథగా తెరకెక్కిన ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. కాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ సినిమా మలయాళంలో మంచి విజయం సాధించిన చార్లీ ఫ్రీమేక్గా తెరకెక్కినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో.. హీరో, హీరోయిన్లు ఘాడంగా ప్రేమించుకుంటారు. కానీ తమ జీవితాన్ని ఫ్రీగా గడపాలనుకున్న ఆ ఇద్దరు చివర్లో ప్రేమను త్యాగం చేస్తారు. ఇక ఇప్పుడు రంగ్దే కూడా అదే కాన్సెఫ్ట్తోనే తెరకెక్కినట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి కథతో టాలీవుడ్లో గతంలోనూ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
previous post