ప్రస్తుతం మల్టీ స్టారర్ చిత్రాలకు ఫుల్ డిమాండ్ ఉండటంతో మహేష్ బాబు, ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ భారీ బడ్జెట్ మూవీకి ప్లాన్ చేస్తున్నారట బడా ప్రొడ్యుసర్ అల్లు అరవింద్. ఎప్పటి నుంచో మహేష్ బాబు, ఎన్టీఆర్లతో సినిమాకి ప్లాన్ చేస్తున్న అల్లు అరవింద్.. ఒకేసారి ఇద్దరితో మల్టీస్టారర్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో మంచి కథ, దర్శకుడు కోసం వెతుకున్నారట ఈ మెగా ప్రొడ్యుసర్. ఫిల్మ్ నగర్లో క్రేజీ గాసిప్గా ఉన్న ఈ మల్టీస్టారర్ మూవీ కార్యరూపం దాల్చితే అటు మహేష్ అభిమానులతో పాటు.. ఇటు ఎన్టీఆర్ అభిమానులకు పండగనే చెప్పాలి. ఇక తండ్రి నిర్మాత అయితే బన్నీ కూడా ప్రమోషన్స్ రంగంలోకి దిగడం ఖాయమే. ఇక భరత్ అనే నేను చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఎన్టీఆర్తో కలిసి పనిచేయడానికి రెడీ అంటూ చెప్పకనే చెప్పారు మహేష్ బాబు. కాగా ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రంతో బిజీగా ఉండగా.. ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి జక్కన్న వద్ద లాక్ అయ్యారు. ఈ చిత్రం తరువాత త్రివిక్రమ్ డైరెక్షన్లో మరో మూవీకి చేయబోతున్నారు ఎన్టీఆర్.
previous post