కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిపై పలువురు స్పందిస్తున్నారు. ఇప్పటికే ఐక్యరాజ్యసమితిలో కూడా సదరు ఉగ్రవాద సంస్థ అధినేతను అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించింది. భారత్ కూడా పాక్ పై సహాయనిరాకరణ ఉద్యమం చేపడుతుంది. దాదాపు దేశం అంతటా తీవ్రంగా నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొద్దీ రోజులలో జరగాల్సిన ఐపీఎల్ 12వ ఎడిషన్ ఓపెనింగ్ సెర్మనీ రద్దు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ సెర్మనీ కోసం వెచ్చించే డబ్బును దాడిలో చనిపోయిన జవాన్ల కుటుంబాలకు ఇవ్వనున్నట్లు సీఓఏ చైర్మన్ వినోద్ రాయ్ వెల్లడించారు.
బీసీసీఐ, సీఓఏ అధికారులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే ప్రారంభ వేడుకలకు వెచ్చించే నగదును పుల్వామా బాధిత కుటుంబాలకు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ నిర్ణయం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. అమర వీరుల ప్రాణాలను తిరిగి తీసుకురాలేం. కానీ ఓ సంస్థగా ఆ అమరవీరుల కుటుంబాల బాధ్యతను తీసుకోవాలని భావించాం అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.