ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి. చిదంబరానికి భారీ షాక్ తగిలింది. ఈ కేసు విచారణ నిమిత్తం చిదంబరాన్ని జ్యుడిషియల్ కస్టడీలో ఉంచేందుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అనుమతిచ్చింది. ఇప్పటికే 15 రోజులు సిబిఐ కస్టడీలో ఉన్న ఆయన్ను ఈరోజు కోర్టు ముందు హాజరుపర్చింది. దీంతో సెప్టెంబర్ 19 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని సీబీఐ కోర్టు ఆదేశించింది.
ఈ నేపథ్యంలో మాజీ ఆర్థికమంత్రిని దేశ రాజధానిలోని తీహార్ జైలుకు తరలించారు. 14 రోజులు ఆయన తీహార్ జైల్లో ఉండనున్నారు. అయితే జైలులో తగిన భద్రత, సౌకర్యాలు కల్పించాలని ఢిల్లీకోర్టును ఆశ్రయించారు చిదంబరం. జెడ్-కేటగిరీ భద్రతలో ఉన్న ఆయనకు అదే తరహా భద్రతను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. జైలులో చిదంబరానికి తగిన భద్రత ఉంటుందని సొలిసిటర్ జనరల్ హామీ ఇచ్చారు.
ఆ సినిమా అంటే చంద్రబాబుకు భయం: లక్ష్మీపార్వతి