telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇండియా తొలి మార్ష‌ల్ ఆర్ట్స్ మూవీ… ప్రకటించిన వర్మ

ETGD

వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్‌వ‌ర్మ ప్ర‌స్తుతం “క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు” అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని న‌వంబ‌ర్‌లో విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తుండ‌గా, చిత్రానికి సంబంధించి రోజుకో అప్‌డేట్ తో వార్తల్లో నిలుస్తున్నాడు వర్మ. ఇప్పటికే ఈ చిత్రం నుంచి 2 ట్రైలర్లను, పలు పాటలను విడుదల చేసి సంచలనం సృష్టించాడు వర్మ. అయితే ఈ సినిమా విడుదలపై పలు అనుమానాలు నెలకొన్నాయి. ఆయన సినిమాల విడుద‌ల సంగ‌తేమో కానీ వ‌రుస సినిమాల‌ను మాత్రం ప్ర‌క‌టిస్తున్నాడు. ఈయ‌న రీసెంట్‌గా `వంగ‌వీటి` ఫేమ్ సందీప్ మాధ‌వ్‌(సాండీ)తో `దాదాస్ ఆఫ్ హైద‌రాబాద్‌` అనే సినిమా చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఇండియా తొలి మార్ష‌ల్ ఆర్ట్స్ మూవీ చేస్తున్న‌ట్లు ఆ సినిమా పేరుని `ఎంట‌ర్ ది గ‌ర్ల్ డ్రాగ‌న్‌` అంటూ ప్ర‌క‌టించాడు. త‌న కెరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమాను చేస్తున్న‌ట్లు వ‌ర్మ తెలియజేశాడు. అంతే కాకుండా బ్రూస్ లీ 80వ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా నవంబ‌ర్ 27న బ్రూస్ లీ పుట్టిన స‌మ‌యం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల 12 నిమిషాల‌కు త‌న సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తాన‌ని ప్ర‌క‌టించాడు.

Related posts