telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

చట్టాలను దాటి, మానవత్వాన్ని చాటుకున్న యూఏఈ

UAE

యూఏఈ చట్టం ప్రకారం ముస్లిం అబ్బాయి వేరే మతానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. కాని ముస్లిం అమ్మాయి వేరే మతానికి చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకోకూడదు. ఒకవేళ అలా చేసుకున్నప్పుడు వారికి పుట్టే బిడ్డలకు యూఏఈ ప్రభుత్వం నుంచి జనన ధృవీకరణ పత్రం(డేట్ ఆఫ్ బర్త్) జారీ చేయరు. అయితే ఇయర్ ఆఫ్ టాలిరెన్స్ సందర్భంగా యూఏఈ ప్రభుత్వం నిబంధనలను సైతం పక్కన పెట్టి ఓ హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయికి పుట్టిన బిడ్డకు సర్టిఫికెట్‌ను జారీ చేసింది. కేరళకు చెందిన కిరణ్(హిందూ), సనమ్ సబు సిద్దిక్(ముస్లిం) 2016లో పెళ్లి చేసుకుని అబూధాబీలో నివసిస్తున్నారు. 2018 జులైలో వారికి ఓ పాప పుట్టింది. యూఏఈ నిబంధనల ప్రకారం వారికి పుట్టిన పాపకు జననధృవీకరణ పత్రం జారీ చేయలేదు. దీంతో కిరణ్ నో అబ్జక్షన్ లెటర్ కోసం కోర్టులో కేసు వేయగా.. నాలుగు నెలల తరువాత కోర్టు ఆ కేసును కొట్టేసింది. ఇండియన్ ఎంబసీ అంబాసడర్ రాజమురుగన్ సహాయంతో కిరణ్ న్యాయ విభాగాన్ని కలిశాడు. ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు మొదటగా చీఫ్ జస్టిస్‌కు రిక్వెస్ట్ లెటర్ పెట్టుకోవాలని.. చీఫ్ జస్టిస్ అంగీకారం తెలిపిన లెటర్‌ను హెల్త్ అథారిటీకి అందిస్తే సర్టిఫికెట్ జారీ చేస్తారని న్యాయవిభాగం సూచించింది. న్యాయవిభాగం తెలిపిన విధంగా చేయగా.. కిరణ్, సనమ్ దంపతులకు జన్మించిన అనామ్తా ఏసెల్లెన్ కిరణ అనే పాపకు నిబంధలను పక్కనపెట్టి మొదటిసారిగా ఏప్రిల్ 14న యూఏఈ ప్రభుత్వం జనన ధృవీకరణ పత్రాన్ని ఇచ్చింది.

Related posts