స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం `అల వైకుంఠపురములో..`. ఈ సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్గా నిలిచింది. దీంతో ఈ సినిమాను పలు భాషల్లోకి రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమా హిందీ రీమేక్లో నటించేందుకు బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ఖాన్ ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం. దీంతో రీమేక్ హక్కుల కోసం ఓ సంస్థ ఏకంగా 8 కోట్ల రూపాయలు చెల్లించేందుకు సిద్ధపడిందట. అయితే నిర్మాత అల్లు అరవింద్ తనే స్వయంగా బాలీవుడ్లో రీమేక్ చేయాలనుకుంటున్నారట. ప్రస్తుతం బాలీవుడ్లో `జెర్సీ` రీమేక్ను నిర్మిస్తున్న అల్లు అరవింద్.. `అల వైకుంఠపురములో..` సినిమాను కూడా స్వయంగా నిర్మించాలనుకుంటున్నారట. అందువల్ల రీమేక్ రైట్స్ వేరే వాళ్లకు ఇచ్చేందుకు ఆయన అంగీకరించడం లేదని అంటున్నారు.
previous post
next post
కశ్మీర్ విభజనపై కమల్హాసన్ సంచలన వ్యాఖ్యలు