2018లో విడుదలైన `అజ్ఞాతవాసి` తర్వాత పవన్కల్యాణ్ మళ్లీ సినిమాల్లో నటించలేదు. ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు మళ్లీ పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్లో విజయవంతమైన `పింక్` చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారు. దిల్రాజు, బోనీకపూర్ నిర్మాతలుగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తాడని టాక్. సినిమా సెట్స్ పైకి వెళ్లే లోపు పక్కా ప్రణాళికతో ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకోవాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. అందులో భాగంగా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయట. కానీ అటు పవన్ క్యాంప్ నుండి ఇటు దర్శక నిర్మాతల నుండి అధికారిక సమాచారం అయితే రాలేదు. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాకు `లాయర్ సాబ్` అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినపడుతున్నాయి.
previous post