telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

కిరోసిన్ పోసుకుని మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య!

Engineering college Fees student sulcide

తెలంగాణ ఇంటర్ బోర్డు తప్పిదాలవల్ల విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు మనస్తాపం చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. నారాయణపేట్ జిల్లా ధన్వాడ మండలం కోడ్రోన్ పల్లి గ్రామానికి చెందిన శిరీష ఈరోజు ఒంటిపై కిరోసిన్ పోసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తాను బాగా చదివినప్పటికీ ఇంటర్ లో ఓ సబ్జెక్టులో ఫెయిల్ కావడంతో ఆ బాలిక నిర్ణయం తీసుకుంది.

నారాయణపేట్ జిల్లాలోని ఓ కళాశాలలో శిరీష ఇంటర్ బైపీసీ చదువుతోంది. అయితే జువాలజీ పరీక్షలో తప్పడంతో మనస్తాపానికి గురైన యువతి ఇంటిమేడ పైకి వెళ్లి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. కానీ మంటల బాధ తాళలేక పైనుంచి కిందకు దూకేసింది శిరీష మరణంతో తెలంగాణలో ఇప్పటివరకూ ప్రాణాలు తీసుకున్న ఇంటర్ విద్యార్థుల సంఖ్య 22కు చేరుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts