telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మరో భారీ ఉగ్రదాడి.. కాశ్మీర్ వెలుపల.. ఇంటెలిజెన్స్ తాజా హెచ్చరిక..!!

intelligence warned about another huge attack

ఇప్పటికే పుల్వామా ఉగ్రాదాడి నేపథ్యంలో భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పుల్వామా దాడికంటే మరింత భారీ దాడి కోసం ప్రణాళిక రచించింది. ఈ నెల 16-17 మధ్య పాకిస్థాన్‌లోని జేషే మహ్మద్ అగ్రనేతలు-పాకిస్థాన్‌లోని దాని ఉగ్రవాదుల మధ్య ఈ మేరకు సంభాషణ జరిగినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. భారత భద్రతా దళాలపై మరింత పెద్ద ఆత్మాహుతి దాడి నిర్వహించాలని ఉగ్రవాదులు ప్రణాళిక రూపొందించినట్టు చెబుతూ ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి.

ఈసారి దాడి జమ్మూలో లేదంటే జమ్ముకశ్మీర్ బయట జరపడానికి జేషే కుట్ర పన్నినట్టు పేర్కొన్నారు. ఇందుకోసం గతేడాది డిసెంబరులో ముగ్గురు ఆత్మాహుతి సభ్యులు సహా 21 మంది ఉగ్రవాదులు కశ్మీర్‌లోకి చొరబడినట్టు చెప్పారు. ఇందులో ఓ ఆత్మాహుతి దాడి సభ్యుడైన అదిల్ అహ్మద్ దర్ పుల్వామా దాడిలో పాల్గొనగా ఇంకా ఇద్దరు దాడికి సిద్ధంగా ఉన్నట్టు ఆయన వివరించారు.

Related posts