తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఇంటర్ పరీక్షలు ఒకేసారి జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఏపీలో గత శుక్రవారం ఫలితాలను విడుదల చేయగా.. తెలంగాణలో మాత్రం ఇంటర్ ఫలితాల విడుదలపై జాప్యం జరుగుతున్న నేపథ్యంలో ఇంటర్ బోర్డు ఫలితాల విడుదల పై స్పష్టత వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నెల 18న ఇంటర్ ఫలితాలను విడుదల చేస్తామంటూ తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఓ పత్రికా ప్రకటనను కూడా విడుదల చేసింది. ఇంటర్ వార్షిక పరీక్షలు 2019 ఫలితాల ప్రక్రియ తుది దశకు చేరుకున్నాయని.. ఈ నెల 18న ఫలితాలను ప్రకటిస్తామని పేర్కొన్నది.