సీబీఐ కలకత్తా సిటీ కమిషనర్ రాజీవ్ కపూర్పై తీవ్ర ఆరోపణలు చేసింది. శారదా స్కామ్కు సంబంధించిన కాల్ డేటా రికార్డులను రాజీవ్ కపూర్ తారుమారు చేశారని సుప్రీం కోర్టుకు విన్నవించింది. సీల్డ్ కవర్లో ఇచ్చిన వివరాలు వాదనలు ప్రారంభ సమయానికే మీడియా చేతికి అందాయి. సర్వీస్ ప్రొవైడర్స్ నుంచి సీబీఐ కాల్ డేటా రికార్డులను సేకరించిందని., రాజీవ్ కుమార్ సమర్పించిన కాల్ డేటా రికార్డులు భిన్నంగా ఉన్నాయని సీబీఐ పేర్కొంది. 2018 జూన్ 28వ తేదీన కాల్ డేటా రికార్డును రాజీవ్ కుమార్ తమకు ఇచ్చారని సీబీఐ తన నివేదికలో పేర్కొంది.శారదా చిట్ ఫండ్ స్కామ్ను రాజీవ్ కుమార్ దర్యాప్తు చేస్తున్నారని… సిట్ సేకరించిన ల్యాప్ ట్యాప్, మొబైల్ ఫోన్స్ వంటివి ఈ కేసులోని నిందితులకు రాజీవ్కుమార్ అందజేశారని సీబీఐ ఆరోపించింది. కోల్కతా హైకోర్టు ఈ కేసు దర్యాప్తును సమీక్షిస్తున్నా… భారీ కుట్రకు రాజీవ్ కుమార్ పాల్పడ్డారని… సీబీఐ చేతికి అందకముందే స్థానిక అధికారులు కీలక సాక్ష్యాలను ధ్వంసం చేశారని సీబీఐ ఆరోపించింది. సుప్రీం కోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఎదుట, సీబీఐ తరఫున అటార్నీ జనరల్ వేణుగాపాల్ వాదనలు వినిపిస్తున్నారు.
కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ సీబీఐ ఎదుట విచారణకు హాజరు కావాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇవాళ ఇరు పక్షాల వాదన విన్న తరవాత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఈ ఆదేశాలు ఇచ్చారు. షిల్లాంగ్లో రాజీవ్కుమార్ను సీబీఐ అధికారులు విచారించాలని పేర్కొన్నారు. అయితే రాజీవ్ కుమార్ను అరెస్ట్ చేయొద్దని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి, డీజీపీ, రాజీవ్ కుమార్లకు కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన నోటీసులు జారీ చేస్తామని పేర్కొంది.
రాజీవ్ కుమార్ అత్యంత కీలక సాక్ష్యాలను నిందితులకు అందజేశారని ఆరోపించారు. కీలక సాక్ష్యాలను సిట్ సాయంతో స్థానిక అధికారులు ధ్వంసం చేశారని ఆరోపించారు. తరవాత పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరఫున సీనియర్ అలాయర్ అభిషేక్ మను సింఘ్వి వాదిస్తూ… ఈ కేసులో ఎఫ్ఐఆర్ లేదని.. మరి సాక్ష్యాలను రాజీవ్కుమార్ ధ్వంసం ఎలా చేస్తారని వాదించారు.
రాత్రి సీబీఐ అధికారులను రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేయలేదంటూ.. వీడియోను కోర్టుకు సమర్పించారు. కేవలం రాజకీయ కక్షతో ఎన్నికల ముందు సీబీఐ బెదిరిస్తోందని అన్నారు.