వార్తా పత్రికల ద్వారా వైరస్ వ్యాప్తి చెందదని ఇంటర్నేషనల్ న్యూస్ మీడియా అసోసియేషన్ (ఐఎన్ఎంఏ) వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు, పలు అంతర్జాతీయ పరిశోధన సంస్థలు దీనిపై అధ్యయనం చేశాయని తెలిపింది. ప్రపంచంలో ఎక్కడా కూడా పత్రికల ద్వారా కరోనా వ్యాప్తి జరిగిన దాఖలాలు లేవని స్పష్టం చేసింది.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చాలా మంది న్యూస్ పేపర్ వేయించుకోవడం లేదు. న్యూస్ పేపర్ వల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే అపార్ట్ మెంట్లలోకి పేపర్ బాయ్స్ ను రానివ్వడం లేదు. తమకు పేపర్ వేయకు అని ఇంటి యజమానులు తేల్చిచెబుతున్నారు. ఈ నేపథ్యంలో న్యూస్ పేపర్లను చాలా మంది వద్దని చెబుతున్నారు. దీంతో ఆయా పేపర్ల సర్క్యులేషన్ తగ్గిపోయిందని ఏజంట్లు వాపోతున్నారు.