telugu navyamedia
సినిమా వార్తలు

“మహానటి” ఛాన్స్ ముందుగా అమలాపాల్ కేనట… కానీ…

Amala-paul

రత్నకుమార్ దర్శకత్వంలో అమలాపాల్ హీరోయిన్ గా రూపొందుతున్న చిత్రం “ఆమె”. తమిళంలో “ఆడై” టైటిల్ తో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను వీ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తుండగా చరిత చిత్ర, తమ్మారెడ్డి భరద్వాజలు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలవ్వగా అందులో నగ్నంగా కన్పించి అందరికీ షాకిచ్చింది అమలాపాల్. ఇటీవల విడుదలైన ట్రైలర్ లో అమలాపాల్ మందు తాగుతూ, సిగరెట్ కాలుస్తూ లిప్ లాక్ చేస్తూ చాలా బోల్డ్ గా కనిపించింది. సినిమాల్లో లిప్ లాక్స్ కామనే అయినప్పటికీ అమలాపాల్ తన సహనటి వీజే రమ్యని ముద్దుపెట్టుకోవడం చర్చకు దారి తీసింది. సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. తెలుగు, త‌మిళంలో ఈ సినిమాను జూలై 19న సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. దీంతో సినిమా ప్రమోషన్లను వేగవంతం చేశారు చిత్రబృందం. ఈ సందర్భంగా అమలాపాల్ ఓ ఆసక్తికరమైన విషయాన్నీ వెల్లడించింది. “మ‌హాన‌టి”లో న‌టించే అవ‌కాశం నిత్యామీన‌న్‌, కీర్తి సురేష్ కంటే ముందు ఆమ‌ల‌కే వ‌చ్చింద‌ట‌. తాజాగా `ఆమె` సినిమా ప్రమోష‌న్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అమ‌ల “మ‌హాన‌టి”ని వ‌దులుకోవ‌డం గురించి స్పందించింది. “మహానటి” సినిమాలో న‌టించే అవ‌కాశం ముందు నాకే వచ్చింది. కానీ ఆ స‌మ‌యంలో నేను నా వ్యక్తిగత విషయాలతో సతమతమవుతున్నాను. దాంతో సినిమా చేయలేకపోయాను. అలా ఓ మంచి సినిమాను వదులుకున్నాను” అని అమ‌ల చెప్పింది. హీరోయిన్‌గా బిజీగా ఉన్న స‌మ‌యంలోనే ద‌ర్శ‌కుడు ఏఎల్ విజ‌య్‌ను పెళ్లి చేసుకుని సినిమాల‌కు దూర‌మైంది. అనంత‌రం విజ‌య్ నుంచి విడాకులు తీసుకుని సినిమాల్లోకి తిరిగి ప్ర‌వేశించింది అమలాపాల్.

Related posts