భారత్లో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది.. తాజా బులెటిన్ ప్రకారం కొత్త కేసులు 10 వేల దిగువకు చేరింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8,013 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి…కొవిడ్ నుంచి మరో 16,765 మంది కోలుకున్నారు.
మరోవైపు మరణాల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది.. ఒకేరోజులో 119 మంది కోవిడ్ వైరస్ తో మృతిచెందారు.. పాజిటివిటీ రేటు 1.11 శాతానికి పడిపోయినట్టు ప్రభుత్వం పేర్కొంది..
మరోవైపు.. కరోనా కట్టడి కోసం చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతోంది… ఆదివారం మరో 4,90,321 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,77,50,86,335కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.