telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మల్టీప్లెక్స్ సూళ్లూరుపేటలో

Largest-Screen

ఆంధ్రప్రదేశ్‌, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో భారీ మల్టీప్లెక్స్ రూపొందనుంది. చెన్నై- కోల్‌కతా రహదారిపై సూళ్లూరుపేటకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పిండిపాళెం వద్ద దేశంలోనే అతిపెద్ద భారీ మల్టీప్లెక్స్‌ను నిర్మిస్తున్నారు. ఈ మల్టిప్లెక్స్ 106 అడుగుల వెడల్పుతో భారీ తెర, 670 సీట్ల సామర్థ్యం, 3డీ సౌండ్ సిస్టంతో అత్యంత అధునాతనంగా రూపుదిద్దుకోనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ రూ.40 కోట్ల వ్యయంతో ఏడున్నర ఎకరాల్లో ఈ భారీ మల్టీప్లెక్స్‌ను నిర్మిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యంత వెడల్పైన తెరలతో కూడిన థియేటర్లు రెండే ఉన్నాయి. ఇది మూడవది కానుంది. ఆసియాలో రెండవ అతిపెద్ద మల్టిప్లెక్స్. ప్రస్తుతం నిర్మిస్తున్న ఈ మల్టీప్లెక్స్‌లో 170 సీట్ల సామర్థ్యం కలిగిన మరో రెండు స్క్రీన్లను కూడా ఉండనున్నాయి.

Related posts