telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ రాజకీయ వార్తలు

చైనా లోని ప్రవాస భారతీయులను .. సురక్షిత ప్రాంతాలకు తరలింపు..

indians in china at safe places

చైనాను చుట్టుముట్టేసిన కరోనా వైరస్ బారిన పడి ఇప్పటికే 82 మంది మరణించారు. మరో 2,700 మందిలో వైరస్ జాడలు కనిపించాయి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల చైనా.. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నియంత్రించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సాధ్యపడట్లేదు. ఈ వైరస్.. దాదాపు అన్ని ప్రావిన్స్‌లకూ విస్తరించిందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కరోనా వైరస్ బారిన పడి రాజధాని బీజింగ్‌లో ఓ వ్యక్తి మరణించారు. బీజింగ్‌లో నమోదైన తొలి మరణం ఇది. వైరస్ పుట్టినిల్లుగా భావిస్తోన్న వుహాన్ నుంచి ఈ నెల 8వ తేదీన బీజింగ్ వచ్చారాయన. అనంతరం.. వారంరోజుల పాటు తీవ్ర జ్వరానికి గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మరణించారు. బీజింగ్‌లో సంభవించిన తొలి కరోనా వైరస్ మృతిగా భావిస్తున్నారు అధికారులు. వైరస్‌ను నియంత్రించడానికి చర్యలు చేపట్టారు. వుహాన్‌, హ్యుబే ప్రావిన్స్‌లో నివసిస్తోన్న ప్రవాస భారతీయులందరినీ సురక్షిత ప్రదేశానికి లేదా స్వదేశానికి తరలించడానికి యుద్ధ ప్రాతిపదికన ఇరు దేశాల అధికారులు చర్యలు చేపట్టారు. దీనికోసం బీజింగ్‌లో రెండు దేశాల రాయబార కార్యాలయ అధికారులు సమావేశం అయ్యారు. వుహాన్‌లో మొత్తం 250 మంది వరకు ప్రవాస భారతీయులు నివసిస్తున్నట్లు గుర్తించారు. వారందరినీ.. వారు కోరుకున్న ప్రాంతానికి గానీ, స్వదేశానికి గానీ తరలించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది.

చైనాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులను కూడా తరలించే ఏర్పాట్లు చేపట్టారు. వుహాన్‌, హ్యుబే ప్రావిన్స్‌లో నివసిస్తోన్న ప్రవాస భారతీయులందరినీ సురక్షిత ప్రదేశానికి లేదా స్వదేశానికి తరలించడానికి యుద్ధ ప్రాతిపదికన ఇరు దేశాల అధికారులు చర్యలు చేపట్టారు. దీనికోసం బీజింగ్‌లో రెండు దేశాల రాయబార కార్యాలయ అధికారులు సమావేశం అయ్యారు. వుహాన్‌లో మొత్తం 250 మంది వరకు ప్రవాస భారతీయులు నివసిస్తున్నట్లు గుర్తించారు. వారందరినీ.. వారు కోరుకున్న ప్రాంతానికి గానీ, స్వదేశానికి గానీ తరలించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. చైనాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులను కూడా తరలించే ఏర్పాట్లు చేపట్టారు. వుహాన్‌, హ్యుబే ప్రావిన్స్‌లో నివసిస్తోన్న ప్రవాస భారతీయులందరినీ సురక్షిత ప్రదేశానికి లేదా స్వదేశానికి తరలించడానికి యుద్ధ ప్రాతిపదికన ఇరు దేశాల అధికారులు చర్యలు చేపట్టారు. దీనికోసం బీజింగ్‌లో రెండు దేశాల రాయబార కార్యాలయ అధికారులు సమావేశం అయ్యారు. వుహాన్‌లో మొత్తం 250 మంది వరకు ప్రవాస భారతీయులు నివసిస్తున్నట్లు గుర్తించారు. వారందరినీ.. వారు కోరుకున్న ప్రాంతానికి గానీ, స్వదేశానికి గానీ తరలించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. చైనాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులను కూడా తరలించే ఏర్పాట్లు చేపట్టారు.

Related posts