ఇప్పటివరకు భారత క్రికెటర్స్ మెన్ ఇన్ బ్లూ గా పేరుగాంచారు. అదేనండి జెర్సీ బ్లూ రంగులో ఉండేది కదా.. అదే. కానీ, ఇప్పటి నుండి అందులో మార్పు.. జెర్సీ రంగు కాషాయానికి మార్చేశారు.. అంటే ఇకనుండి మనవాళ్ళు మెన్ ఇన్ శాఫ్రాన్ అనమాట. నేడు ప్రపంచ కప్ లో భాగంగా వెస్టిండీస్ తో తలపడనున్నారు. ఈ మ్యాచ్ నుండే జెర్సీ మార్పు చోటుచేసుకోనుందట. జర్సీ రంగులో కాషాయాన్ని చొప్పించడం వెనుక మోదీ ప్రభుత్వ ఒత్తిడి ఉందని కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఇంగ్లండ్ జట్టు జర్సీ లు కూడా బ్లూ కలర్ కావటంతో, ఇలా రెండు జట్లూ ఒకే రంగు దుస్తులతో ఆడితే అయోమయం ఉంటుందన్న ఉద్దేశంతో, టోర్నీ ప్రారంభానికి ముందే ప్రతి జట్టూ రెండు రంగుల జెర్సీలను తమ వెంట తెచ్చుకోవాలని అన్ని దేశాలను కోరింది. అందులో భాగంగానే భారత జట్టు రెండు జెర్సీలను ఇంగ్లండ్ తీసుకెళ్లింది.
వైసీపీ రౌడీలు మరో అడుగు ముందుకేశారు: నారా లోకేశ్