telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

వరుస నష్టాలలో.. స్టాక్ మార్కెట్లు..

husge loses again in stock markets

జాతీయంగా ప్రభుత్వ నిర్ణయాలతో నేడు కూడా సూచీలు నష్టాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు మధ్యాహ్నం సమయానికి నష్టాల్లోకి జారుకున్నాయి. కంపెనీల త్రైమాసిక ఫలితాలు నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటిస్తున్నారు. నిన్న కూడా మదుపర్ల జాగ్రత్తతో సూచీలు నష్టాలతోనే ముగిశాయి. ఇవాళ సెన్సెక్స్‌ 80 పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభం కాగా, నిఫ్టీ 10,800 పైన ఆరంభమైంది.

కానీ నేటి మార్కెట్ లావాదేవీలు ముగిసే సమయానికి, సెన్సెక్స్‌ 96.66 పాయింట్లు కోల్పోయి 36009.84 వద్ద ముగిసింది. నిఫ్టీ 26.60 పాయింట్లు నష్టపోయి 10795 పాయింట్లకు చేరింది. నేడు ఎన్ఎస్‌ఈలో ఐటీసీ, యూపీఎల్‌, ఐఓసీ, ఓఎన్‌జీసీ, హిందాల్కో తదితర కంపెనీల షేర్లు లాభపడ్డాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, టాటా మోటార్స్‌, భారతి ఇన్‌ఫ్రాటెల్‌, టీసీఎస్‌, లార్సెన్‌ తదితర కంపెనీల షేర్లు నష్టపోయాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.70.54 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.

Related posts