డాలర్తో రూపాయి మారకం విలువ కొన్నాళ్లుగా బలపడుతుంది. గత ఏడు నెలల్లో తొలిసారి రూ.69మార్కు దిగువకు చేరింది. నేటి ఉదయం రూ.68.91 వద్ద ట్రేడింగ్ మొదలు పెట్టి ఒక దశలో 68.57కు చేరింది. మళ్లీ ఆ తర్వాత కొద్దిగా విలువ కోల్పోయి 11.50గంటలకు 68.59 వద్ద ట్రేడవుతోంది.
వాణిజ్య లోటు తగ్గుముఖం పట్టడం కూడా దీనికి కారణమైంది. ఫిబ్రవరిలో ఈ లోటు 17నెలల అత్యల్ప స్థాయికి చేరింది. ముఖ్యంగా చమురు ధరలు తగ్గడంతో దిగుమతులు తగ్గాయి. ఫిబ్రవరి వాణిజ్యలోటు 9.60 బిలియన్ డాలర్లు కాగా అంతకు ముందు జనవరిలో ఇది 14.7 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ విషయాన్ని వాణిజ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.