telugu navyamedia
వార్తలు సామాజిక

రైళ్లలో తగ్గుతున్న ప్రయాణికుల సంఖ్య

Train Indian railway

లాక్‌డౌన్ సడలింపుల తర్వాత దేశవ్యాప్తంగా ఈ నెల 1 నుంచి ప్రాత్యేక రైళ్లు పట్టాలేక్కిన సంగతి తెలిసిందే. తొలి రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ప్రయాణికులు క్యూకట్టారు. స్క్రీనింగ్ తర్వాతే ప్రయాణికులను లోపలికి అనుమతించడంతో ఆ క్యూ రోడ్డుపైకి వచ్చేసింది. వారం తిరిగే సరికి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పడిపోయింది.

రైల్వే చార్ట్ ప్రకారం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో నిన్న 1,516 మంది ప్రయాణించాల్సి ఉండగా 1,276 మంది మాత్రమే ఎక్కినట్టు అధికారులు తెలిపారు. అలాగే, హౌరా వెళ్లే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో 1,493 మందికి గాను 1,400 మంది, నిజామాబాద్ నుంచి సికింద్రాబాద్ మీదుగా తిరుపతి వెళ్లే రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో 620 మందికి గాను 421 మంది ఎక్కినట్టు అధికారులు తెలిపారు.

Related posts