telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వ్యాపార వార్తలు

ఓటు వేసిన వాళ్లకు .. పెట్రో ధరలలో రాయితీ : ఇండియన్ పెట్రోలియం అసోసియేషన్

Indian petrol association discount on voting day

ఓటు వినియోగం పై అవగాహనా కార్యక్రమాలు రకరకాలుగా చేపడుతుంది ప్రభుత్వం. అయితే ఇది ఇంకో అడుగు ముందుకు వేసి, ఏకంగా రాయితీలు కూడా ఇస్తాం, ఓటు వినియోగించుకోండి అంటున్నారు. అదేమంటే, ఈ ఎన్నికల్లో ఓటేసిన తరువాత పెట్రోలు బంకులకు వచ్చే వినియోగదారులకు పెట్రోలు, డీజిల్ పై రాయితీ ఇవ్వాలని ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ నిర్ణయించింది.

ఓటేసి వచ్చి, చూపుడు వేలిపై ఉండే సిరా మార్క్ ను చూపిస్తే, లీటర్ ఇంధనంపై 50 పైసల రాయితీ పొందవచ్చని అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్ బన్సాల్ వెల్లడించారు. ప్రజలు ఓట్లు వేసేలా ప్రోత్సహించేందుకే ఈ రాయితీని ప్రకటించామని ఆయన అన్నారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పోలింగ్ రోజున ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు.

Related posts