telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ సామాజిక

జాతీయజండా.. మగ్గంపై.. కార్మికుడి దేశభక్తి.. 5 నెలల శ్రమ..

Indian flag made on maggam

మగ్గంపై జాతీయ జెండాను నేసి పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట వేమవరానికి చెందిన చేనేత కార్మికుడు రుద్రాక్షుల రామలింగ సత్యనారాయణ దేశభక్తిని చాటారు. తాను రూపొందించిన జాతీయ జెండా దిల్లీలోని ఎర్రకోటపై ఎగరాలన్న సంకల్పంతో అతుకులు, కుట్లు, రంగుల అద్దకం ఏమీ లేకుండా అశోకచక్రంతో సహా జాతీయ జెండాను మగ్గంపై నేశారు.

ఎర్రకోటపై ఎగురవేసే జెండా కొలతలకు అనుగుణంగా 12 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు ఉండే విధంగా ప్రత్యేకంగా మగ్గంపై తయారు చేశారు. 5 నెలలపాటు శ్రమించి మూడు రంగుల పట్టు నూలుతో జెండాతోపాటు అశోక చక్రం గుర్తును మగ్గంపై నేశారు.

Related posts