telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

సరిహద్దులో కూడా బుద్ది చెప్పడం నేర్చుకున్న … భారత్; తోక ముడిచిన పాక్ సేన..

Indian Man arrested with pak sim card

భారత భద్రతా దళాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి సరిహద్దులో యథేచ్ఛగా కాల్పులకు తెగబడుతున్న పాక్ సైన్యానికి బుద్ధి చెప్పాయి. గత మూడు రోజులుగా జమ్ముకశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో నియంత్రణ రేఖ వద్ద పాక్  కాల్పులకు తెగబడుతోంది. దీనితో ఎదురు కాల్పులు ప్రారంభించిన భారత్ 12 మంది పాక్ సైనికులను మట్టుబెట్టింది. భారత్ కాల్పుల్లో మరో 22 మంది పాక్ సైనికులు తీవ్రంగా గాయపడ్డారు.

ఇద్దరు భారత జవాన్లు పాక్ కాల్పుల్లో అమరలయ్యారు. ముగ్గురు పౌరులు గాయపడ్డారు. భారత సైన్యం ఎదురు కాల్పులు ప్రారంభించడంతో పాక్ సైన్యం వణికిపోయింది. తమ జాతీయ జెండాలను తలకిందులు చేసి ఓటమిని అంగీకరించింది. కాల్పులు ఆపాలంటూ పరోక్షంగా సంకేతాలు పంపడంతో భారత సైన్యం కాల్పులు ఆపింది. భారత కాల్పుల్లో గాయపడిన వారిని పాక్ సైన్యం హెలికాప్టర్లలో ఆసుపత్రికి తరలించింది.

Related posts