telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

వెస్టిండీస్ టూర్ : ..తొలి టి20 .. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న .. భారత్..

india won toss and choose to field

వెస్టిండీస్ సిరీస్ లో భాగంగా నేడు తొలి టి20 మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మూడు టి20 మ్యాచ్ ల సిరీస్ లో ఫ్లోరిడాలో రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ కు ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఇవాళ్టి మ్యాచ్ కోసం టీమిండియా మేనేజ్ మెంట్ యువ ఆటగాళ్లపై నమ్మకం ఉంచింది. వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైనీ, ఖలీల్ వంటి ఆటగాళ్లకు జట్టులో చోటు కల్పించారు. వెస్టిండీస్ జట్టుకు స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ దూరం కావడం ఎదురుదెబ్బ అని చెప్పాలి.

టీమిండియా: శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (కెప్టెన్), మనీశ్ పాండే, రిషబ్ పంత్, కృనాల్ పాండ్య, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్, ఖలీల్, నవదీప్ సైనీ.

వెస్టిండీస్: క్యాంప్ బెల్, ఎవిన్ లూయిస్, నికొలాస్ పూరన్, హెట్మెయర్, పొలార్డ్, పావెల్, బ్రాత్ వైట్ (కెప్టెన్), నరైన్, కాట్రెల్, కీమో పాల్, ఒషేన్ థామస్.

Related posts