telugu navyamedia
క్రీడలు

పారాలింపిక్స్‌: భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం

టోక్యో పారాలింపిక్స్‌ లో భారత్‌ తన జోరును కొనసాగుంది. ఇప్పటికే పలు పతకాలు సాధించిన భారత్‌… బ్యాడ్మింటన్‌(SL3)లో భారత్‌ తొలి స్వర్ణం చేజిక్కించుకుంది. ప్రపంచ నంబర్‌ వన్‌ షట్లర్‌ ప్రమోద్‌ భగత్‌.. ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌ టూ ర్యాంకర్‌, గ్రేట్‌ బ్రిటన్‌ షట్లర్‌ డేనియెల్‌ బెథెల్‌ను 21-11 21-16 తేడాతో మట్టికరిపించాడు.
ఈ స్వర్ణంతో భారత్‌ పతకాల సంఖ్య 16కు చేరగా.. వీటిలో నాలుగు పసిడి, ఏడు రజతం, ఐదు కాంస్య పతకాలు ఉన్నాయి. పారాలింపిక్స్‌ చరిత్రలో భారత్‌కు బ్యాడ్మింటన్‌లో ఇదే తొలి పతకం కావడం విశేషం. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ SL3 లో కాంస్య పతకం సాధించాడు మనోజ్ సర్కార్. దీంతో భారత్‌ పతకాల సంఖ్య 17 కు చేరుకుంది.

Related posts