కంబోడియా-భారత నౌకా దళానికి చెందిన యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ సహ్యాద్రి, ఐఎన్ఎస్ కిల్తాన్లు మూడు రోజుల పర్యటనకు బయలుదేరి వెళ్లాయి. ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాల బలోపేతానికి ఈ పర్యటన ఉపకరిస్తుందని తూర్పు నౌకాదళం పేర్కొంది.
రాయల్ కంబోడియన్ నేవీతో వృత్తిపరమైన అంశాలు, ఉన్నతాధికారులతో సమావేశాలు, అక్కడి ప్రజలతో మమేకమై కార్యక్రమాలు నిర్వహిస్తారని వివరించింది. సహ్యాద్రికి కెప్టెన్ అశ్విన్ అరవింద్, కిల్తాన్కు కమాండర్ గింటో జార్జ్ చాకో సారథ్యం వహిస్తున్నారు.