telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

రాంచీ టెస్ట్ మ్యాచ్… లంచ్ బ్రేక్ కు టీమిండియా 71/3

Ranchi

దక్షిణాఫ్రికాతో రాంచీ వేదికగా శనివారం ఆరంభమైన మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్‌కి తొలి సెషన్‌లో ఊహించని ఎదురుదెబ్బలు తగిలాయి. సఫారీ ఫాస్ట్ బౌలర్లు కగిసో రబాడ, నోర్తోజ్ జోరుతో లంచ్ విరామానికి మూడు వికెట్లు చేజార్చుకున్న టీమిండియా 71 పరుగులతో నిలిచింది. క్రీజులో ప్రస్తుతం ఓపెనర్ రోహిత్ శర్మ (38 బ్యాటింగ్: 68 బంతుల్లో 5×4, 1×6), వైస్ కెప్టెన్ అజింక్య రహానె (11 బ్యాటింగ్: 20 బంతుల్లో 1×4) ఉన్నారు. వైజాగ్, పుణె టెస్టులో శతకాలు బాదిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్.. ఈరోజు ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లోనే ఔటైపోయాడు. రబాడ బౌలింగ్‌లో ఆఫ్ స్టంప్‌కి వెలుపగా పడిన బంతిని వెంటాడిన మయాంక్ అగర్వాల్ (10:19 బంతుల్లో 2×4) స్లిప్‌లో డీన్ ఎల్గర్ చేతికి చిక్కాడు. అప్పటికి భారత్ స్కోరు 12 పరుగులుకాగా.. 16 పరుగుల వద్దే చతేశ్వర్ పుజారా (0: 9 బంతుల్లో) కూడా రబాడ బౌలింగ్‌లోనే డకౌటయ్యాడు. రబాడ విసిరిన బంతిని అంచనా వేయడంలో తడబడిన పుజారా ఎల్బీడబ్ల్యూ ఔటయ్యాడు. 4 పరుగుల వ్యవధిలోనే రెండు వికెట్లు చేజారడంతో.. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి (12: 22 బంతుల్లో 2×4) రెండు చూడచక్కని ఫోర్లతో మళ్లీ భారత్ శిబిరంలో ఉత్సాహం నింపాడు. కానీ.. ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేసిన నోర్తోజ్ బౌలింగ్‌లో కోహ్లీ ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. అంపైర్ నిర్ణయంపై డీఆర్‌ఎస్‌కి వెళ్లినా.. కోహ్లీ‌కి నిరాశే ఎదురైంది. దీంతో.. జట్టు స్కోరు 39/3 నుంచి నిలకడగా ఆడిన రహానె – రోహిత్ జోడీ.. నాలుగో వికెట్‌కి 45 బంతుల్లో 32 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి.. తొలి సెషన్‌ని ముగించింది.

Related posts