2019 ప్రపంచ కప్ తిలకించేందుకు సామాన్య జనంతో పాటుగా సెలెబ్రిటీలు కూడా ఆసక్తి చూపుతున్నారు. అది భారత్ ఆడే క్రికెట్ మ్యాచ్ లంటే ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. అందునా ఆస్ట్రేలియా వంటి జట్టుతో, అది కూడా వరల్డ్ కప్ అయితే… ఆ మ్యాచ్ పై ఎంత ఆసక్తి ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
‘మహర్షి’ సూపర్ హిట్ కావడంతో, ప్రస్తుతం తన ఫ్యామిలీతో పలు దేశాల్లో పర్యటిస్తూ, సెలబ్రేట్ చేసుకుంటున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, నేడు ఓవల్ మైదానంలో జరిగే ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరగనున్న మ్యాచ్ కి భార్యా, పిల్లలతో కలిసి హాజరు కానున్నాడట. ఈ మ్యాచ్ నేడు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. స్టేడియంలో మహేశ్, భారత జట్టుకు మద్దతిస్తూ, ఎలా అల్లరి చేస్తాడో వేచి చూడాలి.