telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

అండర్‌-19 ఆసియాకప్‌ : .. వర్షానికి రద్దైన మ్యాచ్ .. తుదిపోరుకు భారత్ ..

india under 19 team to asia cup finals

భారత యువ జట్టు శ్రీలంకతో జరగాల్సిన సెమీ ఫైనల్‌ వర్షం కారణంగా రద్దవటంతో ఫైనల్‌కు చేరింది. వరుణుడి కరుణించకపోవడంతో టాస్‌ కూడా వేయలేదు. దీంతో ‘గ్రూప్‌-ఎ’లో అగ్రస్థానంలో ఉన్న భారత్‌ తుదిపోరుకు అర్హత సాధించింది. అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌ మధ్య జరిగిన సెమీస్‌ కూడా వర్షం కారణంగా రద్దయింది. ‘గ్రూప్‌-బీ’లో టాపర్‌గా ఉన్న బంగ్లా ఫైనల్‌కు చేరింది. రేపు కొలంబోలో భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య ఫైనల్ జరగనుంది.

ఇప్పటికే భారత జట్టు అద్భుత ప్రదర్శనతో గ్రూప్‌ దశలో ఆడిన మూడు మ్యాచుల్లోనూ విజయం సాధించింది. బంగ్లాదేశ్ కూడా అన్ని మ్యాచుల్లోనూ గెలిచి ఫైనల్‌కు చేరింది. ఇటీవల బంగ్లాదేశ్, ఇంగ్లాండ్‌తో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించి టీమ్‌ఇండియా టైటిల్‌ను కైవసం చేసుకుంది. రేపు జరిగే తుదిపోరులోనూ బంగ్లాను ఓడించి విజేతగా నిలవాలని భారత యువ జట్టు భావిస్తోంది.

Related posts